పిచ్చి గోవర్ధనంటారు: పాల్వాయిపై చిరుమర్తి ప్రతి దాడి
కూతురును శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు ఇచ్చిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి నల్గొండ నుండి పోటీ చేయాలని చూస్తున్నారని అన్నారు. అతను ఎన్నికల్లో పోటీ చేస్తే సామాన్య కార్యకర్త పైన కూడా గెలిచే సత్తా లేదన్నారు. ఆయనను నల్గొండ జిల్లాలో పిచ్చి గోవర్ధన్ అని పిలుస్తారని విమర్శించారు. పాల్వాయికి మతి భ్రమించిందన్నారు.
కోమటిరెడ్డి సోదరుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు. పార్టీలు మారిన చరిత్ర పాల్వాయికే ఉందన్నారు. పైరవీలు చేసి రాజ్యసభ సభ్యుడిగా అయిన ఆయన విమర్శలు చేస్తే విడ్డూరంగా ఉందన్నారు.
కాగా, మంగళవారం పాల్వాయి గోవర్దన్ రెడ్డి మరో ఇద్దరు ఇంటి దొంగలున్నారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పార్టీలో పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సోదరులతో పాటు మరో ఇద్దరు ఇంటి దొంగలు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై చిలుమర్తి లింగయ్య స్పందించారు.
నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి సోదరులు వైయస్సార్ కాంగ్రెసు కాంగ్రెసు పార్టీలోకి వెళ్తారనే ప్రచారం కొంతకాలం సాగిన విషయం తెలిసిందే. కోమటిరెడ్డి సోదరులకు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో వారు జగన్ వైపు వెళ్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత తెరాసలోకి వెళ్తారనే ప్రచారం జరిగింది.