హోలీ వేడుకల్లో అపశృతులు: 8 మంది దుర్మరణం
హోలీ వేడుకుల్లో రంగులు చల్లుకున్న తర్వాత స్నానం చేయడానికి దిగిన యువకుడు ప్రమాదవశాత్తు అందులో మునిగిపోయి మరణించాడు. నల్లగొండ జిల్లాలో ఓ ఆరేళ్ల బాలుడు మరణించాడు. హోలీ వేడుకల తర్వాత స్నానం చేస్తుండగా ట్యాంకులో పడి అతను చనిపోయాడు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం కోయలగూడెంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
హోలీ వేడుకలు జరుపుకుంటుండగా ట్రక్ ఢీకొట్టడంతో ఓ యువకుడు మరణించాడు. ఈ దుర్ఘటన గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పులలో చోటు చేసుకుంది.
కడప జిల్లాలో మిత్రులతో హోలీ ఆడుకుంటూ ఓ ఐదేళ్ల బాలుడు బోర్వెల్లో పడిపోయాడు. గ్రామస్థులు అతన్ని వెలికి తీసి కాపాడారు. ఈ సంఘటన కడప జిల్లా వేంపల్లి మండలం కుమరంపల్లిలో జరిగింది.
నిజామాబాద్ జిల్లాలో ఐదుగురు విద్యార్థులు మరణించారు. హోలీ వేడుకల తర్వాత సిరికొండ బసంత్ నగర్ చెరువులో స్నానానికి దిగిన ఐదుగురు విద్యార్థులు మరణించారు. దీంతో స్థానికంగా విషాదం చోటు చేసుకుంది. మధ్యాహ్నం విద్యార్థులంతా కలిసి బసంత్నగర్ చెరువుకు స్నానానికి వెళ్లారు. స్నానం చేసిన తర్వాత ఇళ్లకు తిరిగి వచ్చిన తర్వాత చూస్తే ఐదుగురు కనిపించలేదు. దీంతో గాలింపు చేపట్టారు. గాలింపులో ఐదుగురి శవాలు చెరువులో కనిపించాయి.