నాని, వనిత..: జగన్ వర్గంపై ఫిర్యాదు, ఇద్దరు టి నేతలు
శాసనసభలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా తమ పార్టీ విప్ను ఉల్లంఘించారంటూ తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన టిడిపి వారిపై సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని కోరింది. వారిపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేసింది. ఇందులో ఏడుగురు సీమాంధ్ర నేతలు, ఇద్దరు తెలంగాణ నేతలు ఉన్నారు.
విప్ ఉల్లంఘనపై ఇచ్చిన ఎమ్మెల్యేల జాబితాలో శిరియా సాయిరాజ్(ఇచ్ఛాపురం), తానేటి వనిత (గోపాలపురం), కొడాలి నాని (గుడివాడ), చిన్నం రామకోటయ్య (నూజివీడు), అమర్నాథ్ రెడ్డి (పలమనేరు), ప్రవీణ్ కుమార్ రెడ్డి (తంబళ్లపల్లి), బాలనాగి రెడ్డి (మంత్రాలయం), హరీశ్వర్ రెడ్డి (పరిగి), వేణు గోపాలాచారి (ముధోల్)లు ఉన్నారు.
అవిశ్వాసంపై రెండు దఫాల ఓటింగ్కు అందరూ హాజరై తటస్థంగా వ్యవహరించాలని టిడిపి విప్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే చిన్నం రామకోటయ్య, వేణు గోపాలాచారి, హరీశ్వర్ రెడ్డి ఓటింగ్కు రాలేదు. మిగిలిన వారు వచ్చినా ఓటింగ్లో పాల్గొన్నారు. అయితే, హరీశ్వర్ రెడ్డి అవిశ్వాసాన్ని చర్చకు తీసుకోవచ్చా లేదా అన్నదానిపై ఓటింగ్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ వీరికి నోటీసులు జారీ చేసి, సమాధానం అందిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు.