ఊడిపడిన విమానం డోర్: ఎపిఎక్స్ప్రెస్ బోగీలో మంటలు
ఈ విమానం గోవా నుండి పూణే మీదుగా హైదరాబాద్ రావాల్సి ఉంది. ఇందులో దాదాపు రెండు వందల మంది వరకు ప్రయాణీకులు ఉన్నారు. ప్రయాణీకుల్లో ప్రముఖ సంగీత దర్శకుడు రమణ గోగుల కూడా ఉన్నారు. పూణే, హైదరాబాద్, బెంగళూరుకు చెందిన ప్రయాణీకుల్లో ఎక్కువగా తెలుగువారే ఉన్నారు.
ఈ విమానం మధ్యాహ్నం నిర్ణీత సమయం 1.45 నిమిషాలకు టేకాఫ్ తీసుకుంటుండగా డోర్ ఒక్కసారిగా విరిగింది. పైలట్ వెంటనే గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లోకి ఎగిరి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేది. పైలట్ సమయస్ఫూర్తిని అందరూ మెచ్చుకున్నారు. బాంబే నుండి మరో విమానాన్ని రప్పించి ప్రయాణీకులను తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎపి ఎక్స్ప్రెస్ బోగిలో మంటలు
ఎపి ఎక్స్ప్రెస్లోని ఎస్-8 బోగిలో శుక్రవారం మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. ప్రయాణీకులు చైన్ లాగడంతో రైలును నాగపూర్ దాటిన తర్వాత నిలిపివేశారు. బోగిలో పొగ కమ్ముకుంది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది అగ్నిమాపక సిబ్బందితో మంటలను ఆర్పి వేశారు. అనంతరం రైలును నాగపూర్ తీసుకు వెళ్లి బోగిని మార్చారు.