ఎస్పీకి శవయాత్రనే: ములాయంతో బేనీ కొత్త పంచాయతీ
తమ కాంగ్రెసు పార్టీ ఉత్తరప్రదేశ్లోని 80 సీట్లకు పోటీ చేస్తుందని, వాటిలో 40 సీట్లు గెలుస్తుందని బేనీ ప్రసాద్ వర్మ తాజాగా అన్నారు. బిజెపికి పది సీట్లను కూడా దక్కనీయమని ఆయన అన్నారు. బిఎస్పీ మాయావతి 36 సీట్లు గెలుస్తారని ఆయన శనివారం అన్నారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో ఏయే రాజకీయ పార్టీలు ఏ విధమైన ఫలితాలు సాధిస్తాయో ఆయన వివరించారు.
ములాయంకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని గతంలో బేనీ ప్రసాద్ వర్మ ఆరోపించిన విషయం తెలిసిందే. బేనీ ప్రసాద్ వర్మ చేత రాజీనామా చేయించాలని ములాయం సింగ్ యాదవ్ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ను కలిసినప్పుడు డిమాండ్ చేశారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ జోక్యం చేసుకుని ములాయం సింగ్ యాదవ్తో మాట్లాడారు. దీంతో బేనీ ప్రసాద్ వర్మ తన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేశారు.
యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించే ఆలోచన తమకు ప్రస్తుతానికి లేదని ములాయం సింగ్ యాదవ్ శుక్రవారంనాడు చెప్పారు. సమాజ్వాదీ పార్టీకి 22 మంది పార్లమెంటు సభ్యులున్నారు. యుపిఎకు వీరి మద్దతు అత్యంత కీలకం.