నాడు పురంధేశ్వరి ఎవరికి తెల్సు!: టిఎస్సార్ సంచలనం
అయితే నాటి ఎన్నికల సమయంలో ఆమె కాంగ్రెస్లోకి వస్తే బావుంటుందని తనతో పాటు మరికొందరు పార్టీ పెద్దలు భావించి, ఆహ్వానించామన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ చేసి తీరతానని, కేంద్రమంత్రి పురందేశ్వరి నర్సరావుపేట నుంచి పోటీ చేస్తారంటూ పలు సందర్భాల్లో టిఎస్సార్ ప్రకటించిన విషయం తెలిసిందే.
పురందేశ్వరి తనకు సోదరితో సమానమని, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు తనకు ఆప్తమిత్రుడన్నారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసే ఉద్దేశం పురందేశ్వరికి లేకున్నా.. కొంతమంది మీడియా మిత్రులు ఆమెతో ఏదో ఒకటి మాట్లాడిస్తున్నారని ఆయన అన్నారు.
ఏప్రిల్ 20న టిఎస్సార్ జాతీయ సినిమా అవార్డులను ప్రదానం చేస్తామని వెల్లడించారు. దీని కోసం ఏర్పాటైన ప్రత్యేక కమిటీకి తాను చైర్మన్గా వ్యవహరిస్తానని చెప్పారు. ఏప్రిల్ 12న విశాఖలో టిఎస్సార్ ఉగాది పురస్కారాలు అందజేస్తామని, ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ను ఈ సందర్భంగా ఘనంగా సత్కరిస్తామని చెప్పారు.