గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కారులో డిగ్రీ యువతి మృతదేహం: అదుపులోకి డ్రైవర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vijayawada
విజయవాడ/గుంటూరు: గుంటూరు జిల్లా తెనాలిలో గురువారం రాత్రి ఓ యువతి మృతదేహం కలకలం రేపింది. వాహనాల తనిఖీల్లో భాగంగా పోలీసులకు ఓ కారులో యువతి మృతదేహం లభ్యమైంది. దుండగులు యువతిని విజయవాడలో అపహరించి తెనాలిలో హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలు విజయవాడకు చెందిన సుష్మప్రియగా గుర్తించారు. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

పద్మప్రియ వయస్సు 19గా ఉంటుందని భావిస్తున్నారు. కథనం ప్రకారం.. విజయవాడకు చెందిన శ్రీనివాస రావు స్థానికంగా కేబుల్ సెంటర్ నడుపుతున్నాడు. ఆయన కుమార్తె సుష్మప్రియ సోమవారం కళాశాలకని చెప్పి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. వారి వద్ద పని చేస్తున్న డ్రైవర్ పాల్ మీద అనుమానంతో వారు పరిసర ప్రాంతాల్లో వెదికారు. డ్రైవర్ భార్య కూడా మృతురాలి బంధువులతో పాటు వెతికింది.

మరోవైపు పోలీసులు కూడా వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి మంగళవారం రాత్రి తెనాలిలో డ్రైవర్, కారులో మృతదేహం కనిపించింది. ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు. అయితే, దీనిని హత్యగా భావిస్తున్నారు. విచారణలో నిందితుడు సుష్మప్రియ పురుగుల మందు తాగిందని చెప్పాడని సమాచారం.

అయితే మృతురాలి బంధువులు దీనిని ఖండిస్తున్నారు. డ్రైవరే తమ బిడ్డను చంపేసి ఉంటాడంటున్నారు. పోలీసులు వివరాలు నమోదు చేసుకొని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

English summary
19 year old woman dead body found in a car at Tenali of Guntur district on Tuesday night. Car driver arrested by police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X