నలుగురు ఉపాధ్యాయ అక్కాచెల్లెళ్లపై యాసిడ్ దాడి
మంగళవారం వీరు కంధాల్లోని హింద్ ఇంటర్ కళాశాలలో యుపి బోర్డు పరీక్ష విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు యాసిడ్తో దాడి చేశారు. ఆ తర్వాత వారు అక్కడి నుండి పారిపోయారు. ఇద్దరు వ్యక్తులు అక్కాచెల్లెళ్లపై యాసిడ్తో దాడి చేసి ఆ తర్వాత అక్కడి నుండి పారిపోయారని స్థానిక పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో కమజ్ జహాన్(26), ఆయేషా(25), ఇషా(23), సనమ్(20)లు తీవ్రంగా గాయపడ్డారు. పెద్ద సోదరికి అందరికంటే ఎక్కువ గాయాలయ్యాయి. వీరిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇషా ఎడమ కన్ను బాగా దెబ్బతిన్నట్లు వైద్యులు తెలిపారు. యాభై శాతం కంటే కొద్దిగా తక్కువగా వారి శరీరం కాలింది. శత్రువులు లేనందున, గతంలో ఎవరు తమను వేధింపులకు గురి చేయనందున తమపై దాడి చేసిందెవరో అక్కాచెల్లెళ్లు తేల్చుకోలేకపోతున్నారు.
నలుగురిలో ఒక సోదరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను చికిత్స కోసం ఢిల్లీకి తరలించారు. మిగిలిన ముగ్గురికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. యాసిడ్ దాడి చేసిన వారికి 8 నుండి 12 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇందులో బెయిల్ లభించే అవకాశాలు ఉన్నాయి.