హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ కేసు: రాజగోపాల్‌ను ప్రశ్నించిన సిబిఐ

By Pratap
|
Google Oneindia TeluguNews

Rajagopal
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో రాష్ట్ర గనుల మాజీ మేనేజింగ్ డైరెక్టర్ రాజగోపాల్ శనివారం సిబిఐ ముందు హాజరయ్యారు. ఆయనను సిబిఐ అధికారులు మూడు గంటల పాటు ప్రశ్నించారు. సిమెంట్ కంపెనీలకు సున్నంరాయి గనుల కేటాయింపుపై సిబిఐ అధికారులు ఆయనను విచారించినట్లు సమాచారం. రాజగోపాల్ గనుల ఎండిగా ఉన్నప్పుడు సిమెంట్ కంపెనీలకు పెద్ద యెత్తున గనుల కేటాయింపులు జరిగాయి.

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) కేసులో ఆయన ఏడాదిన్నర క్రితం అరెస్టయ్యారు. బెయిల్‌పై ఆయన బయటకు వచ్చారు. ఇప్పుడు జగన్ కేసులో ఆయనను సిబిఐ అధికారులు సిబిఐ విచారించింది.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయంలో పెన్నా, దాల్మియా సిమెంట్ కంపెనీలకు సున్నంరాయి గనుల కేటాయింపు జరిగింది. పెన్నా సిమెంట్స్‌కు రంగారెడ్డి జిల్లా తాండూరులో 822 ఎకరాల గనులు, మరో రెండు జిల్లాల్లో సున్నంరాయి గనులు కేటాయించారు. ఆలాగే, దాల్మియా కంపెనీకి కడప జిల్లా మైలవరం ప్రాంతంలో 407 హెక్టార్ల సున్నంరాయి గనులను కేటాయించారు.

గనుల కేటాయింపులకు ప్రతిఫలంగా ఆ కంపెనీలు వైయస్ జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాయనే ఆరోపణలున్నాయి. పెన్నా సిమెంట్స్ 68 కోట్ల రూపాయలు, దాల్మియాకు చెందిన కంపెనీ 95 కోట్ల రూపాయలు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయాలపై రాజగోపాల్‌ను సిబిఐ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో శ్రీలక్ష్మి పాత్ర కూడా ఉన్నట్లు సిబిఐ అధికారులు అనుమానిస్తున్నారు.

English summary
CBI grilled former mines MD Rajagopal in YSR Congress party president YS Jagan case. He has been questioned for 3 hours by CBI today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X