వైయస్ జగన్ కేసు: రాజగోపాల్ను ప్రశ్నించిన సిబిఐ
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) కేసులో ఆయన ఏడాదిన్నర క్రితం అరెస్టయ్యారు. బెయిల్పై ఆయన బయటకు వచ్చారు. ఇప్పుడు జగన్ కేసులో ఆయనను సిబిఐ అధికారులు సిబిఐ విచారించింది.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయంలో పెన్నా, దాల్మియా సిమెంట్ కంపెనీలకు సున్నంరాయి గనుల కేటాయింపు జరిగింది. పెన్నా సిమెంట్స్కు రంగారెడ్డి జిల్లా తాండూరులో 822 ఎకరాల గనులు, మరో రెండు జిల్లాల్లో సున్నంరాయి గనులు కేటాయించారు. ఆలాగే, దాల్మియా కంపెనీకి కడప జిల్లా మైలవరం ప్రాంతంలో 407 హెక్టార్ల సున్నంరాయి గనులను కేటాయించారు.
గనుల కేటాయింపులకు ప్రతిఫలంగా ఆ కంపెనీలు వైయస్ జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాయనే ఆరోపణలున్నాయి. పెన్నా సిమెంట్స్ 68 కోట్ల రూపాయలు, దాల్మియాకు చెందిన కంపెనీ 95 కోట్ల రూపాయలు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయాలపై రాజగోపాల్ను సిబిఐ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో శ్రీలక్ష్మి పాత్ర కూడా ఉన్నట్లు సిబిఐ అధికారులు అనుమానిస్తున్నారు.