వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్ ఏ ఒక్కరి ట్రేడ్ మార్క్ కాదు: మైసురా రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

MV Mysura Reddy
హైదరాబాద్: ఎన్టీ రామారావు ఏ ఒక్కరికో ట్రేడ్ మార్క్ కాదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత ఎంవి మైసురా రెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌పై తమకే పేటెంట్ హక్కు ఉందని కొందరు అనుకుంటున్నారని, అది సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. మైసూరా రెడ్డి మంగళవారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల పాదయాత్ర సందర్భంగా ఏర్పాటుచేస్తున్న ఫ్లెక్సీల్లో ఎన్టీఆర్ ఫొటో పెట్టడంపై మీడియా ప్రతినిధులు స్పందన కోరినప్పుడు - "దాంతో మాకేం సంబంధం. ఈ అంశంపై పార్టీ పరంగా ప్రకటన ఇవ్వాల్సిన అవసరంలేదు. ఎవరో చేసిందానికి, మేమెందుకు జవాబు చెప్పాలి'' అని ఆయన సమాధానమిచ్చారు.

"ఎన్టీఆర్ ప్రముఖ సినీ నటుడు. చాలా కాలం రాజకీయాల్లో ఉన్నారు. సీఎంగా పనిచేశారు. ఆయనపై చాలా మందికి అభిమానం ఉండవచ్చు. అందులో తప్పేమి లేదు. ప్రజాభిమానం ఉన్నప్పుడు, ఎవరైనా ఆయన ఫొటో పెట్టుకోవచ్చు" అని ఆయన అన్నారు.

ఎన్టీఆర్‌పై ప్రేమ-అభిమానం ఉండేవారు ఎవరైనా, దానికి సంతోషించాలని, అంతేకాని బాధపడటం, రాజకీయాలు చేయటం, ఊరంతా ఖండించాలనటం సరి కాదని, వాళ్లు సమస్య సృష్టించుకున్నారని, దాన్ని అందరిపై రుద్దటం తప్పు అని మైసూరా రెడ్డి అన్నారు.

English summary
YSR Congress party leader MV Mysura Reddy said that NT Rama Rao not belongs to one perticular party. He condemned the attitude of the Telugudesam party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X