అన్నింటి తర్వాతే...: సిబిఐ కోర్టులో జగన్ మరో పిటిషన్
కాగా, తన ఆస్తుల కేసులో విజయ సాయి రెడ్డి దాఖలు చేసిన మెమోలాంటిదే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కోర్టులు బుధవారం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దాల్మియా సిమెంట్స్పై దాఖలు చేసిన సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్నే తుది చార్జిషీట్గా పరిగణించాలని ఆయన కోర్టును కోరారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను సిబిఐ ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు.
తన ఆస్తుల కేసులో ఒకే చార్జిషీట్ను దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, అయితే సిబిఐ ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తూ వేర్వేరు చార్జిషీట్లను దాఖలు చేస్తోందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోర్టును కోరారు. అంశాలవారీగా చార్జిషీట్లు దాఖలు చేయడం సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని ఆయన అన్నారు.
దాల్మియా సిమెంట్స్ వ్యవహారంపై తన కేసులో సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్పై జగన్ ఆ మెమోను దాఖలు చేశారు. ఏడు అంశాలపై సిబిఐ చార్జిషీట్లు దాఖలు చేస్తామని చెప్పిందని, అది సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడమేనని ఆయన అన్నారు. తన బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఒకే చార్జిషీట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని జగన్ గుర్తు చేశారు.
నిందితులకు రిమాండ్ పొడిగింపు
జగన్ ఆస్తులు, ఎమ్మార్, ఓఎంసి కేసు నిందితులకు సిబిఐ ప్రత్యేక కోర్టు రిమాండును పొడిగించింది. వారి రిమాండును 29వ తేది వరకు కోర్టు పొడిగించింది.