700 మీటర్ల లోయలో పడ్డ వాహనం: 12 మంది మృతి
హైదరాబాదులో కంటైనర్ ఢీకొని బాలుడి మృతి
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని చాంద్రాయణగుట్టలో ఓ కంటైనర్ సోమవారం ఉదయం బీభత్సం సృష్టించింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ మృతి చెందగా మరో ఎనిమిది మంది గాయపడ్డారు. చాంద్రాయణగుట్టలోని ఉప్పుగూడలో ఈ ఘటన జరిగింది. 12 ఏళ్ల బాలుడు పాఠశాల బస్సు కోసం రోడ్డు దాటుతుండగా కంటైనర్ ఢీకొని మృతి చెందాడు. పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
విశాఖలో అగ్ని ప్రమాదం
విశాఖపట్టణంలోని ద్వారకానగర్ ప్రధాన ఆర్టీసి బస్టాండు వద్ద ఉన్న ఓ దుకాణ సముదాయంలో ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు కాంప్లెక్సులోని ఓ దుకాణంలో మంటలు చెలరేగి మిగతా దుకాణాలకు అంటున్నాయి. పోలీసులు కాంప్లెక్సులోని వారిని ఖాళీ చేయించారు. నాలుగు అంతస్తుల ఈ భవనంలో మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది చల్లార్చే ప్రయత్నాలు చేస్తోంది.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు - ప్రకాశం జిల్లా సరిహద్దుల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గిద్దలూరు - నంద్యాల రోడ్డు వద్ద టాటా ఏస్ వాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.
బస్సులో మంటలు
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండ్రాజవరం మండలం పాలంగి సమీపంలో ఉదయం ఓ స్కూలు బస్సు ఇంజిన్లో మంటలు చెలరేగాయి. అఫ్రమత్తమైన డ్రైవర్ బస్సులోని విద్యార్థులను క్షేమంగా బయటకు దించేశాడు. బస్సు దగ్ధమైంది.