తిరుమలలో అగ్ని ప్రమాదం: అన్న ప్రసాదాల నిలిపివేత
ఘటన స్థలానికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కనుమూరి బాపిరాజు, జెఈవో శ్రీనివాస రాజు చేరుకున్నారు. పరిస్థితిని వారు సమీక్షిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు. నిత్యాన్నదాన గోదాంలో అగ్ని ప్రమాదం నేపథ్యంలో అన్న ప్రసాదాలను నిలిపివేశారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో అగ్నిమాపక సిబ్బంది లోనికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో శనివారం కూడా అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. శ్రీవారి వడ ప్రసాదం తయారు చేసే పోటులో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే అగ్నిమాపక శకటాలు, సిబ్బందితో పాటు, అక్టోపస్ దళాలు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు. అప్పటి అగ్నిప్రమాద ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని కలుగలేదు. ఈ రెండు ప్రమాదాలకు షాట్ సర్క్యూటే కారణం.