వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పురంధేశ్వరికి ఎర్త్: విశాఖ సీటుపై మళ్లీ టిఎస్సార్ కాక

By Srinivas
|
Google Oneindia TeluguNews

Purandeswari-T Subbirami Reddy
విశాఖపట్నం: కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామి రెడ్డి విశాఖ పార్లమెంటు స్థానంపై మరోసారి కాకరేపారు. ఆయన బుధవారం మాట్లాడుతూ... తనకు విశాఖతో 32 ఏళ్ల అనుబంధముందని చెప్పారు. తాను వచ్చే సాధారణ ఎన్నికలలో విశాఖ నుండే పోటీ చేస్తానని చెప్పారు.

పార్టీ అధిష్టానం టిక్కెట్ తనకే ఇస్తుందన్న నమ్మకం తనకుందన్నారు. తాను అందరికీ ఆమోదయోగ్యమైన, అందుబాటులో ఉండే వ్యక్తినని చెప్పారు. విశాఖపట్నం తనదే అన్నారు. అయితే, అధిష్టానం నిర్ణయాన్ని తాను శిరసా వహిస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ప్రస్తుతం విశాఖ నుండి ప్రాతనిథ్యం వహిస్తున్న కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి నరసారావుపేట నుండి పోటీ చేస్తారని చెప్పారు.

కేంద్ర మంత్రి, ఎన్టీ రామారావు కూతురు దగ్గుబాటి పురంధేశ్వరికి కాంగ్రెసు సీనియర్ నేత టి. సుబ్బిరామిరెడ్డి నుంచి తిప్పలు తప్పడం లేదు. విశాఖపట్నం లోకసభ స్థానం కోసం టియస్సార్ పట్టు వీడేట్లు కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి తాను పోటీ చేయాలని టి. సుబ్బిరామి రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారు.

విశాఖ నుండే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పిన ఆయన మరోసారి ఇదే విషయాన్ని చెప్పారు. ఇందుకోసం ఆయన అక్కడే పర్యటిస్తూ తన వర్గాన్ని ఏకతాటి పైకి తీసుకు వస్తున్నారట. శివరాత్రి సందర్భంగా విశాఖ తీరంలో ఆయన భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

English summary
Union Minister and NT Ramarao's daughter Daggubati Purandeswari is facing tough fight from T Subbirami Reddy on Vishakapatnam loksabha seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X