హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కల్యాణంలో సామరస్యం: కోటిన్నరతో జగ్గారెడ్డి నగలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Srirama Navami
హైదరాబాద్/మెదక్: శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో పలు ప్రాంతాల్లో మతసామరస్యం వెల్లువిరిసింది. శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు కళకళలాడుతున్నాయి. సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాదులోని కుత్బుల్లాపూర్‌లో మతసామరస్యం వెల్లువిరిసింది. కుత్బుల్లాపూర్‌లోని ప్రగతి నగర్‌లో శ్రీసీతారాముల కల్యాణానికి స్థానిక ముస్లింలు, క్రైస్తవులు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.

ప్రారంభమైన శోభా యాత్ర

శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాదులోని పాతబస్తీ ప్రాంతం నుండి శోభా యాత్ర ప్రారంభమైంది. దూల్ పేట నుండి ఈ యాత్ర భారీ బందోబస్తు మధ్య కొనసాగుతోంది. ఈ యాత్రలో భక్తులతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు. శోభాయాత్ర మార్గంలో సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు.

కోటిన్నర బంగారు ఆభరణాలు

శ్రీ సీతారాముల కల్యాణం సందర్భంగా సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి రూ.కోటిన్న రూపాయల బంగారు ఆభరణాలు చేయించారు. జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని స్థానిక ఆలయంలో ప్రతి ఏటా సీతారాముల కల్యాణోత్సవాన్ని జరుపుతారు.

ఈ ఏడాది సీతారాములకు జగ్గారెడ్డి కోటిన్నర రూపాయల బంగారు ఆభరణాలు చేయించారు. బంగారు ఆభరణాలతో స్వామి వారు, అమ్మవారు దగదగలాడుతున్నారు. సంగారెడ్డి శ్రీరామ కల్యాణోత్సవానికి భక్తులు పోటెత్తారు.

భైంసాలో ఉద్రిక్తత

అదిలాబాద్ జిల్లా భైంసాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భైంసాలో హిందూ వాహిని కార్యకర్తల శోభాయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తలు, భక్తులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు.

English summary
CM Kiran Kumar Reddy has submitted Pattu Vasthralu and Talmbralu to Sri Seetharama Kalyanam on Friday in Bhadrachalam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X