వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2జి స్కామ్: మన్మోహన్‌ సింగ్‌ను లాగుతున్న రాజా

By Pratap
|
Google Oneindia TeluguNews

A Raja
చెన్నై: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలోకి మాజీ టెలికం మంత్రి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను లాగుతున్నారు. 2జి స్పెక్ట్రమ్ కేటాయింపులపై ప్రతి విషయంపై ప్రధానిని సంప్రదించానని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించి తాను సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి)కి వంద పేజీల్లో సవివరమైన నోట్ ఇస్తానని ఆయన చెప్పారు.

తన నోట్ చూసిన తర్వాత జెపిసి తనను పిలుస్తుందని ఆశిస్తున్నానని, ప్రధానిని సంప్రదించిన తర్వాత తాను నిర్ణయాలు తీసుకున్నానని, తాను నిర్దోషినని నిరూపించుకోగలనని ఆయన ఆయన చెన్నై విమానాశ్రయంలో మీడియా ప్రతినిధులతో అన్నారు. న్యూఢిల్లీ నుంచి ఆయన శుక్రవారంనాడు చెన్నైకి వచ్చారు.

2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో జెపిసి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు క్లీన్ చిట్ ఇవ్వడంపై యుపిఎ భాగస్వామ్య పక్షమైన డిఎంకె అధినేత కరుణానిధి - ఒక మంత్రి (రాజా) ప్రధానిని ఎలా తప్పుదోవ పట్టించగలరనని అడిగారు. జెపిసి డ్రాఫ్ట్ రిపోర్టుపై స్పందిస్తూ దీన్ని ఎలా నమ్మగలమని ఆయన ప్రశ్నించారు.

అప్పటి టెలికం మంత్రి ఎ రాజా ప్రధానిని తప్పుదోవ పట్టించారంటూ జెపిసి మన్మోహన్ సింగ్‌కు క్లీన్‌చిట్ ఇచ్చింది. నివేదికకు సంబంధించిన విషయాలు న్యూస్ చానెల్స్‌లో వార్తలు రావడం ప్రారంభించగానే డిఎంకె అధికార ప్రతినిధి గురువారం ప్రతిస్పందించారు. రాజాపై ఆరోపణలన్నీ అబద్ధాలని ఆయన అన్నారు. రాజా వాదన వినకుండా ఎలా నిర్ణయానికి వస్తారని ప్రశ్నించారు.

English summary
Former telecom minister A Raja said on Friday that he took all decisions on 2G spectrum allocation in consultation with the Prime Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X