అక్కడా షర్మిల, బ్రదర్లకు వాటాలు: ఎన్విఎస్ఎస్ ఫైర్
ఉత్తరాఖండ్లోని పవర్ ప్రాజెక్టులలో వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్లకు వాటాలు ఉన్నాయని ఆరోపించారు. ఉత్తరాంచల్కు చెందిన సదరు కంపెనీలో షర్మిలకు పెద్ద మొత్తంలో వాటా ఉందని ఆరోపించారు. అక్కడి కంపెనీకి హైదరాబాదుకు చెందిన పలు బ్యాంకుల నుండి రుణాలు అందాయన్నారు.
విదేశాలలో బినామీ కంపెనీల ద్వారా నల్ల ధనాన్ని తెల్లధనంగా మార్చారని ఆరోపించారు. ఉత్తరాఖండ్కు చెందిన స్వస్తి కంపెనీలో 48 శాతం వాటా, రూ.40 కోట్ల షేర్లు వారికున్నాయని విమర్శించారు. హైదరాబాదులో రుణాలు తీసుకొని ఉత్తరాంచల్లో కంపెనీ, ఢిల్లీలో కార్యాలయం పెట్టారన్నారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకొని షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్లు అక్రమంగా రుణాలు పొందారన్నారు. విదేశీ పెట్టుబడుల పేరుతో దోచుకున్నారన్నారు. జలయజ్ఞంతో లబ్ధి పొందింది కాంట్రాక్టర్లే అన్నారు. బయ్యారం గనుల ప్లాంటును ఖమ్మం జిల్లాలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.