వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య కన్నుమూత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Brahmanaish
హైదరాబాద్: కృష్ణా జిల్లా అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు అంబటి బ్రాహ్మణయ్య ఆదివారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన వయస్సు 75. హైదరాబాద్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈ ఉదయం కన్నుమూశారు. బ్రాహ్మణయ్య 2009లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా అవనిగడ్డ నుండి గెలుపొందారు.

ఇతను గ్రామ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. బ్రాహ్మణయ్య మృతితో తెలుగు దేశం పార్టీ శ్రేణులు అందరూ విషాదంలో మునిగిపోయారు. బ్రాహ్మణయ్య స్వగ్రామం కృష్ణా జిల్లా నాగాయలంక మండలం వక్కపట్లవారిపాలెం. గ్రామస్థాయి నుండి అతను అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే, ఎంపిగా గెలుపొందారు.

కలుపుగోలు వ్యక్తిగా, మచ్చలేని వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. జనతా పార్టీ నుండి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 1994లో మచిలీపట్నం ఎమ్మెల్యేగా, 199లో మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందారు. 2009లో అవనిగడ్డ ఎమ్మెల్యేగా మండలి బుద్ద ప్రసాద్ పైన విజయం సాధించారు.

అంబటి బ్రాహ్మణయ్య కృష్ణా జిల్లా టిడిపి అధ్యక్షుడిగా తొమ్మిదేళ్లు పని చేశారు. ఆయన ఇటీవలి వరకు వ్యవసాయం చేశారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

English summary

 Avanigadda Telugudesam Party MLA Ambati Brahmanaish passed away on Sunday Morning in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X