రాద్దాంతం చేస్తే..: తెలంగాణ నేతలకు గంటా వార్నింగ్
జాతీయ సంపదపై రాద్దాంతం చేయడం తెలంగాణ నేతలకు సరికాదన్నారు. ఎవరు అడ్డుకున్నా బయ్యారం గనులను విశాఖ స్టీల్స్కు కేటాయిస్తామన్నారు. బయ్యారం ఉక్కును విశాఖ స్టీల్స్కు అడ్డుకుంటే కెజి బేసిన్ గ్యాస్ను తాము అడ్డుకుంటామని హెచ్చరించారు. తమకు ఎవరినీ రెచ్చగొట్టే ఉద్దేశ్యం లేదన్నారు. ఇతరులు రెచ్చగొడితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన అన్నారు.
తెలంగాణ నేతలు ప్రాంతీయతత్వంతో వ్యవహరించడం మానుకోవాలన్నారు. తెలంగాణకు గ్యాస్, పెట్రోలు, పాలు ఆంధ్రా ప్రాంతం నుండే వెళ్తున్నాయన్నారు. వాటిని ఆపేస్తామంటే ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు. బయ్యారం గనులను విశాఖ స్టీల్స్కు కేటాయించడాన్ని తెలంగాణ నేతలు తప్పు పడుతున్న విషయం తెలిసిందే.
తెలంగాణ సహజ వనరుల్లో ఒక్క ఇనుప ఖనిజం ముక్కను ఆంధ్రాకు తరలించినా తెలంగాణ అగ్నిగుండమే అవుతుందని టీఆర్ఎస్ఎల్పీ నేత ఈటెల రాజేందర్ ఆదివారం హెచ్చరించారు. బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు డిమాండ్తో.. ఆయనతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, సోమారపు సత్యనారాయణ, టి.రాజయ్య, మొగులూరి భిక్షపతి, కల్వకుంట్ల విద్యాసాగర్రావు, ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, పాతూరి సుధాకర్ రెడ్డిల బృందం ఆదివారం వరంగల్ జిల్లా గూడూరు, ఖమ్మం జిల్లా బయ్యారం ఇనుప ఖనిజం గుట్టల్ని సందర్శించింది.