షర్మిల మౌనంపై టిడిపి!: హెరిటేజ్లో డైరెక్టర్గా బ్రాహ్మణి
పరిస్థితిను చూసి ఆమె కూడా చాలాచోట్ల నోరు విప్పకుండా మౌనయాత్ర చేస్తున్నారన్నారు. కృష్ణా జిల్లాలో షర్మిల సాగించిన యాత్రలో ఆమె మౌనానికి కారణమేమిటో వైయస్సార్ కాంగ్రెసే చెప్పాలన్నారు. కడప పార్లమెంటు సీటును భారతీ రెడ్డి సోదరుడికి కేటాయిస్తున్నందుకా? బయ్యారం ఇనుప ఖనిజం గనుల కేటాయింపులు రద్దయినందుకా? అని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో అడుగుపెడుతున్న షర్మిల అక్కడైనా బయ్యారం గురించి మాట్లాడాలని సవాల్ చేశారు.
హెరిటేజ్ ఫుడ్స్లో డైరెక్టర్గా బ్రాహ్మణి
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ ఫుడ్స్(ఇండియా)లో డైరెక్టర్గా నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి నియమితులయ్యారు. సోమవారం జరిగిన కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశం ఈ నియామకానికి ఆమోదముద్రను వేసింది. మరోవైపు ఇప్పుడున్న హెరిటేజ్ ఫుడ్స్(ఇండియా) లిమిటెడ్ అనే పేరులో ఫుడ్స్(ఇండియా)ను తొలగించి హెరిటేజ్ లిమిటెడ్ అని మార్చాలని నిర్ణయించారు.
కాగా, బ్రాహ్మణి సతీమణి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ వ్యవహారాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రాహ్మణి హెరిటేజ్ వ్యవహారాలు చూసుకోనున్నారు. తాను పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తానని, బ్రాహ్మణి హెరిటేజ్ బాధ్యతలు చూస్తుందని నారా లోకేష్ గతంలో చెప్పారు.