గర్ల్ ప్రాణం తీసిన క్రికెట్ పిచ్చి: జగన్ పార్టీ నేతపై దాడి
ఆమె సోదరుడు మాత్రం వేరే ఛానల్ చూస్తానని చెప్పాడు. రిమోట్ కోసం ఇరువురి మధ్య వాదన జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన మధుప్రియ విషపు ఇంజక్షన్తో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఇతర కారణాల కోణంలోను పోలీసులు విచారిస్తున్నారు. మృతురాలు నర్సుగా పని చేస్తోంది.
విద్యార్థిని అదృశ్యం
గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పెదపులిపర్రులో ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైనట్లుగా గుంటూరు గ్రామీణ ఎస్పీ కార్యాలయంలో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్ష ఫలితాల తర్వాత నుండి విద్యార్థిని కనిపించడం లేదని సమాచారం.
జగన్ పార్టీ నేతపై బాంబు దాడి
కడప జిల్లాలోని పెద్దముడియం మండలం శుద్దపల్లిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వెంకటేశ్వర్ రెడ్డిపై ప్రత్యర్ధులు బాంబులతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్ రెడ్డిని ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.