హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గర్ల్ ప్రాణం తీసిన క్రికెట్ పిచ్చి: జగన్ పార్టీ నేతపై దాడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Suicide
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో క్రికెట్ పిచ్చి ఆత్మహత్యకు దారి తీసింది. అల్వాల్‌లో అక్కా తమ్ముళ్లు టీవి చూసేందుకు పోటీ పడ్డారు. ఈ ఘటనలో మనస్థాపానికి గురైన అక్క ఆత్మహత్య చేసుకుంది. ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ చూసేందుకు సోదరి మధుప్రియ సోమవారం రాత్రి పట్టుబట్టింది.

ఆమె సోదరుడు మాత్రం వేరే ఛానల్ చూస్తానని చెప్పాడు. రిమోట్ కోసం ఇరువురి మధ్య వాదన జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన మధుప్రియ విషపు ఇంజక్షన్‌తో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఇతర కారణాల కోణంలోను పోలీసులు విచారిస్తున్నారు. మృతురాలు నర్సుగా పని చేస్తోంది.

విద్యార్థిని అదృశ్యం

గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పెదపులిపర్రులో ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైనట్లుగా గుంటూరు గ్రామీణ ఎస్పీ కార్యాలయంలో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్ష ఫలితాల తర్వాత నుండి విద్యార్థిని కనిపించడం లేదని సమాచారం.

జగన్ పార్టీ నేతపై బాంబు దాడి

కడప జిల్లాలోని పెద్దముడియం మండలం శుద్దపల్లిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వెంకటేశ్వర్ రెడ్డిపై ప్రత్యర్ధులు బాంబులతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్ రెడ్డిని ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

English summary
A Teenage girl was committed suicide on Monday night for TV remote.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X