ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజధానిలో అగ్నిప్రమాదం: సీటుకోసం గన్‌తో కాల్చాడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Fire accident in Hyderabad
హైదరాబాద్/కర్నూలు: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని అబిడ్స్‌లోని బొగ్గులకుంటలోని ఓ నాలుగంతస్తుల భవంతిలో ఈ ప్రమాదం బుధవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో జరిగింది. భారీగా మంటలు చెలరేగుతున్నాయి.

ఇందులో పుస్తకాల గోడౌన్ ఉండటంతో మంటలు అదుపులోకి రావడం లేదు. పుస్తకాలు కాలిపోయాయి. నాలుగు అంతస్తు వరకు మంటలు వ్యాపించాయి. నాలుగున్నర గంటలుగా ఐదు ఫైరింజన్‌లతో మంటలు ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ క్షణమైనా భవంతి కూలిపోయే ప్రమాదం కూడా ఉందని అనుమానిస్తున్నారు.

ట్రైన్ సీటు కోసం కాల్చాడు

కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తి రైలులో సీటు కోసం తోటి ప్రయాణీకుడిని కాల్చిన సంఘటన జరిగింది. నంద్యాల వద్ద ఎక్కిన ఓ గన్ మెన్ తన తోటి ప్రయాణీకుడు సింగవరంతో సీటు కోసం జరిగిన వాదనలో ఆవేశానికి లోనై అతడిని కాల్చాడు. బాధితుడుని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు గన్ మెన్ నుండి తుపాకిని స్వాధీనం చేసుకున్నారు.

పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్య

ఖమ్మం జిల్లాలో ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. జిల్లాలోని బయ్యారం మండలం కొత్తగూడెంలో ఇది జరిగింది. అయిలయ్య, హైమావతిలకు పదిహేనేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ముగ్గురు పిల్లలు. వారు కూలి పని చేసుకుంటు బతుకు వెళ్లదీసుకుంటున్నారు. ఇటీవల తన భర్త చెడు వ్యసనాలకు లోనయ్యాడని, తమను పట్టించుకోవడం లేదనే ఆవేదనతో భార్య తన ముగ్గురు పిల్లలతో కలిసి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

English summary
Tension gripped the busy Abids area, as fire broke out in a ground plus four storeyed building housing books godown.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X