వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖాళీ ఉంది, వెళ్తే తప్పేంటి?: పురంధేశ్వరిపై టిఎస్సార్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Purandeswari and Tsr
హైదరాబాద్: కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి వచ్చే ఎన్నికల్లో నర్సారావుపేట నియోజకవర్గం నుండే పోటీ చేస్తారని రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామి రెడ్డి శుక్రవారం అన్నారు. విశాఖపట్నం లోకసభ స్థానంపై కాంగ్రెసు పార్టీలో అంతర్గంతంగా రగడ ఉన్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందించారు.

గతంలో నర్సారావుపేట నియోజకవర్గాన్ని పురంధేశ్వరి ఆశించారని, ప్రస్తుతం అక్కడ ఖాళీగా ఉందని అక్కడకు వెళ్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. తాను 2014 సాధారణ ఎన్నికల్లో విశాఖ లోకసభ స్థానం నుండే పోటీ చేస్తానని చెప్పారు. ఈ విషయమై వివాదాలు సృష్టించవద్దని ఆయన కోరారు.

తాను విశాఖలో చేసిన అభివృద్ధిని ఉత్తరం ద్వారా తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దృష్టికి ఇటీవలె తీసుకు వెళ్లానన్నారు. గురువారం సోనియాను కలిశానని చెప్పారు. విశాఖ ప్రజలకు తాను ఎంతో చేశానన్నారు. తన రాజ్యసభ పదవి కాలం త్వరలో ముగుస్తుందని అందుకే విశాఖ నుండి పోటీ చేస్తానన్నారు. అక్కడ గెలిచే శక్తి తనకుందన్నారు.

కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి ప్రస్తుతం విశాఖ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పురంధేశ్వరికి ముందు టి.సుబ్బిరామి రెడ్డి ఈ నియోజకవర్గం నుండి ప్రాతనిథ్యం వహించారు. ఇప్పుడు మళ్లీ ఆయన ఈ నియోజకవర్గం టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

English summary
Rajya Sabha Member T.Subbirami Reddy has said he will contest from Vishakapatnam in the 2014 Lok Sabha general elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X