వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా మెచ్చుకున్నారు: వైజాగ్‌పై సుబ్బిరామిరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

T Subbarami Reddy
న్యూఢిల్లీ: విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో తాను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామి రెడ్డి గురువారం చెప్పారు. ఆయన సోనియాను కలుసుకొని విశాఖకు చేస్తున్న అభివృద్ధి గురించి చెప్పి వచ్చే ఎన్నికల్లో ఆ నియోజకవర్గ టిక్కెట్ కోసం అర్థించారు. గతంలో ఈ విషయమై సోనియాకు అతను లేఖ కూడా రాశారు.

విశాఖపట్నం జిల్లాలో తాను 32 ఏళ్లుగా ధార్మిక, సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నానని, అణగారిన వర్గాల అభ్యున్నతికి పాల్పడుతున్నానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, అల్పసంఖ్యాక వర్గాలు, మత్స్యకారులు, మహిళా సంఘాల సంక్షేమానికి వేదికలను ఏర్పాటు చేశానని, ప్రత్యేకంగా వైద్య, ఆరోగ్య ఫోరం ఏర్పాటు చేసినట్లు సోనియాకు వివరించారు.

దేవాలయాలు, చర్చిలు, మసీదుల మరమ్మతులకు సాయం అందించానని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహాల వితరణ, మహిళలకు కుట్టుమిషన్లు, లక్షల మందికి కంటి ఆపరేషన్లు వైద్య సాయం అందించినట్లు చెప్పుకున్నారు. విశాఖను మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు.

సోనియాతో భేటీ అనంతరం సుబ్బిరామి రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సోనియా గాంధీ అభినందించారని, సంక్షేమ పథకాలను మరింత మందికి చేరువయ్యేలా కృషి చేయాలని సూచించారన్నారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ స్థానం తనదే అన్నారు.

English summary

 Rajyasabha Member T Subbirami Reddy has met AICC president Sonia Gandhi on Thursday and told his Vizag activities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X