లాహోర్ జైల్లో ఖైదీల దాడి: కోమాలో సరబ్జిత్ సింగ్
సరబ్జిత్ వెంటిలేటర్పై ఉన్నాడని, ఐవి డ్రిప్ తీసుకుంటున్నాడని పాకిస్తాన్ వైద్యులు భారత అధికారలకు చెప్పారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ఈ విషయం చెప్పారు. లాహోర్లోని జిన్నా ఆస్పత్రిలోని ఐసియులో చికిత్స పొందుతున్న సరబ్జిత్ను భారత హై కమిషన్ అధికారులు సందర్శించారు.
సరబ్జిత్కు వైద్యులు ఎక్స్ - రేలు, ఎంఐఆర్, సిటి స్కాన్స్ వంటివి నిర్వహించారు. గంట పాటు సరబ్జిత్ను, ఇతర ఖైదీలను సెల్స్ నుంచి బయటకు వదిలినప్పుడు ఆ సంఘటన జరిగింది. ఇద్దరు ఖైదీలు సరబ్జిత్ తలపై బలంగా కొట్టారు. దీంతో తలకు తీవ్రమైన గాయమైంది.
తొలుత జైలులోని ఆస్పత్రికి సరబ్జిత్ను తరలించారు. పరిస్థితి విషమించడంతో అతన్ని లాహోర్లోని జిన్నా ఆస్పత్రికి తరలించారు. పంజాబ్ ప్రొవిన్స్లో జరిగిన బాంబు దాడుల కేసులో సరబ్జిత్ను దోషిగా నిర్ధారించారు. 1990లో జరిగిన ఈ సంఘటనలో 14 మంది మరణించారు.