తెలంగాణ: శ్రీకృష్ణ కమిటీ నివేదికపై అగ్నివేశ్ ఫైర్
తెలంగాణ ఏర్పాటు చేస్తే హర్యానా, పంజాద్ మాదిరిగా అభివృద్ధి చెందుతుందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే అక్కడ బతుకుందని, లేదంటే రెండు ప్రాంతాల్లో మనుగడ కష్టం అని అగ్నివేష్ హెచ్చరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ పార్లమెంటులో దీక్ష చేపట్టిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలకు, తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న సంసద్ సత్యాగ్రహ దీక్షకు స్వామి అగ్నివేష్, బీజేపీ నేతలు ఉమా భారతి, స్మృతి ఇరానీలు మంగళవారం మద్దతు ప్రకటించారు. అనంతరం వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
తెలంగాణలో అన్ని రకాల వనరులు ఉన్నాయని, ప్రత్యేక రాష్ట్రంతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని మరో నేత ఉమాభారతి అన్నారు. బీజేపీ హయాంలో మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేశామని, బిజెపి అధికారంలోకి వస్తే తెలంగాణ ఏర్పాటు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. తెలంగాణ కోసం అందరూ కలిసి పోరాటం చేయాలని ఉమాభారతి పిలుపునిచ్చారు.
తెలంగాణ నినాదాల హోరు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చెవులకు చేరాలని నటి, బిజెపి ఎంపి స్మృతి ఇరానీ అన్నారు. రెండు రోజుల సత్యాగ్రహ దీక్ష అనంతరం తెలంగాణ జెఎసి కార్యకర్తలు, నాయకతులు పార్లమెంటు వైపు దూసుకెళ్లారు. దీంతో పరిస్తితి ఉద్రిక్తంగా మారింది.