వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నాటక ఫలితాలు: టీవీ రిపోర్టర్‌గా మారిన చిద్దూ

By Pratap
|
Google Oneindia TeluguNews

Chidambaram and Jaswant Singh
న్యూఢిల్లీ: కర్నాటక శానససభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం టీవీ రిపోర్టర్‌గా మారిపోయారు. ఓ టీవీ రిపోర్టర్ చేతి నుంచి చిదంబరం మైక్ తీసుకుని పార్లమెంటు నుంచి బయటకు వస్తున్న బిజెపి నేత జస్వంత్ సింగ్ ముందు పెట్టారు.

విజయానికి కాంగ్రెసుకు క్రెడిట్ ఇవ్వారా అని చిదంబరం జస్వంత్ సింగ్ అడిగారు. నిజానికి, జస్వంత్ సింగ్ బయటకు వస్తున్న సమయంలో అక్కడ ఉన్న చిదంబరాన్ని మీడియా ప్రతినిధులు కర్ణాటక ఫలితాలపై ప్రతిస్పందనను అడగాలని అనుకున్నారు. వెంటనే చిదంబరం ఓ టీవీ రిపోర్టర్ నుంచి మైక్ తీసుకుని జస్వంత్ సింగ్‌కు ప్రశ్నలు వేశారు.

మైక్‌ను టీవీ రిపోర్టర్‌కు తిరిగి ఇస్తూ జస్వంత్ సింగ్ జెంటిల్‌మన్ అని వ్యాఖ్యానించారు. కర్ణాటక ఫలితాలు రాజకీయ పార్టీలకు హెచ్చరిక అని, ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వారు ఫలితాలు చూపించాల్సిందేనని చిదంబరం అన్నారు.

చిదంబరం వ్యాఖ్యతో జస్వంత్ సింగ్ ఏకీభవిస్తూ పరిపాలనకు ప్రజలు ఓటేస్తారని, పాలన స్తంభిస్తే ప్రజలు ఓడిస్తారని అన్నారు. జస్వంత్ సింగ్ బిజెపిలో సీనియర్ నేత అనే విషయం తెలిసిందే. బిజెపి కేంద్ర ప్రభుత్వంలో ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేశారు.

English summary
BJP's defeat in Karnataka assembly polls turned finance minister P Chidambaram into a 'TV reporter' on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X