కర్నాటక ఫలితాలు: టీవీ రిపోర్టర్గా మారిన చిద్దూ
విజయానికి కాంగ్రెసుకు క్రెడిట్ ఇవ్వారా అని చిదంబరం జస్వంత్ సింగ్ అడిగారు. నిజానికి, జస్వంత్ సింగ్ బయటకు వస్తున్న సమయంలో అక్కడ ఉన్న చిదంబరాన్ని మీడియా ప్రతినిధులు కర్ణాటక ఫలితాలపై ప్రతిస్పందనను అడగాలని అనుకున్నారు. వెంటనే చిదంబరం ఓ టీవీ రిపోర్టర్ నుంచి మైక్ తీసుకుని జస్వంత్ సింగ్కు ప్రశ్నలు వేశారు.
మైక్ను టీవీ రిపోర్టర్కు తిరిగి ఇస్తూ జస్వంత్ సింగ్ జెంటిల్మన్ అని వ్యాఖ్యానించారు. కర్ణాటక ఫలితాలు రాజకీయ పార్టీలకు హెచ్చరిక అని, ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వారు ఫలితాలు చూపించాల్సిందేనని చిదంబరం అన్నారు.
చిదంబరం వ్యాఖ్యతో జస్వంత్ సింగ్ ఏకీభవిస్తూ పరిపాలనకు ప్రజలు ఓటేస్తారని, పాలన స్తంభిస్తే ప్రజలు ఓడిస్తారని అన్నారు. జస్వంత్ సింగ్ బిజెపిలో సీనియర్ నేత అనే విషయం తెలిసిందే. బిజెపి కేంద్ర ప్రభుత్వంలో ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేశారు.