పురంధేశ్వరిపై కొణతాల ఫైర్: కిరణ్ రెడ్డికి సిఆర్ చేయి
కాంగ్రెసు నాయకులు పగటి కలలు కంటే తాను చేసేదేమీ లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ నాయకుల ఇష్టానిష్టాలతో తనకు పనిలేదని స్పష్టం చేశారు. తాను కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. స్థానిక సంస్థల కోసమే జగన్కు బెయిల్ రాకుండా చూస్తున్నారని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శ్రీశైలం పర్యటనకు దేవాదాయ శాఖ మంత్రి సి. రామచంద్రయ్య డుమ్మా కొట్టారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా శనివారం ఉదయం శ్రీశైలం చేరుకున్న ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి శ్రీశైలం శ్రీ బ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. సీఎంకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అంతకు ముందు శ్రీశైలం చేరుకున్న వెంటనే సాక్షి గణపతి ఆలయన్ని సీఎం దర్శించుకున్నారు.
దేవాదాయ శాఖ మంత్రిగా ఆ పర్యటనలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సి. రామచంద్రయ్య స్వాగతం చెప్పాల్సి ఉంది. అయితే, ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఆయన దూరంగా ఉన్నారు. కడపలోనే సి. రామచంద్రయ్య ఉన్నారు. తనకు అధికారులు ఆలస్యంగా సమాచారం ఇచ్చారని ఆయన అలక వహించినట్లు చెబుతున్నారు. తనను ఉద్దేశ్యపూర్వకంగానే అధికారులు విస్మరిస్తున్నారని రామచంద్రయ్య మండిపడుతున్నట్లు సమాచారం.
చిరంజీవిని సి. రామచంద్రయ్య ఇటీవల ఆకాశానికెత్తుతూ మాట్లాడుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో చిరంజీవికి మించిన నాయకుడు లేడని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు ముఖ్యమంత్రి అభ్యర్థి చిరంజీవేనని ఆయన అంటున్నారు. ఈ నేపథ్యంలో సి. రామచంద్రయ్యకు, ముఖ్యమంత్రికి మధ్య తీవ్రమైన విభేదాలు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.