వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్‌కు ఢిల్లీ రాజీనామాల సెగ: విహెచ్, శంకరన్న ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

V Hanumanth Rao
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కేంద్ర మంత్రుల రాజీనామాల సెగ తగులుతోంది. తీవ్రమైన ఆరోపణలతో కేంద్ర మంత్రులు పవన్ కుమార్ బన్సల్, అశ్వినీ కుమార్ చేసిన రాజీనామాల నేపథ్యంలో రాష్ట్ర మంత్రులపై చర్యలు తీసుకోవాలనే ఒత్తిడి ముఖ్యమంత్రి కిరణ్ కుమార రెడ్డిపై పెరుగుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో కళంకిత మంత్రులకు ఉద్వాసన చెప్పాలని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు, మాజీ మంత్రి పి. శంకరరావు వేర్వేరుగా డిమాండ్ చేశారు.

అవినీతి ఆరోపణలు ఎదుర్కునేవారిని తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహించబోరని, కేంద్రంలో ఇద్దరు మంత్రులతో రాజీనామాలు చేయించారని, రాష్ట్రంలో కూడా కళంకిత మంత్రులను తొలగించడం మంచిదని హనుమంతరావు అన్నారు. సోనియా మాదిరిగానే కళంకిత మంత్రులపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు.

కళంకిత మంత్రులు రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్తే మంచిదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అవినీతిని నిర్మూలించడం వల్లనే కర్ణాటకలో కాంగ్రెసుకు ప్రజలు పట్టం కట్టారని ఆయన అన్నారు. అవినీతిని సోనియా గాంధీ సహించబోరని ఆయన చెప్పారు.

వైయస్ జగన్ అస్తుల కేసులో వివాదాస్పద జీవోలు జారీ చేసిన మంత్రులు రాజీనామా చేయాల్సిందేనని మాజీ మంత్రి శంకరరావు అన్నారు. వారు రాజీనామా చేయకపోతే ముఖ్యమంత్రి వారిని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కూడా ఆరోపణలున్నాయని ఆయన అన్నారు. కళంకిత మంత్రులను మంత్రివర్గంలో ఎలా కొనసాగనిస్తారని ఆయన అడిగారు.

English summary

 The Rajyasabha member V Hanumanth Rao and the Congress senior MLA P Shankar Rao demanded CM Kiran kumar Reddy remove tainted ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X