రూ. 2000 ఇవ్వలేదని భార్యను హత్య చేసిన వ్యక్తి

నిందితుడిని షానుగా గుర్తించారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. మృతురాలిని 20 ఏళ్ల పింకీగా గుర్తించారు. వీరిద్దరికి మూడేళ్ల క్రితం వివాహమైంది. సంఘటన జరిగిన సమయంలో వారి ఏడాది కుమారుడు నిద్రపోతున్నాడు.
పింకీ బంధువు లక్ష్మి జన్మదిన వేడుకలకు వచ్చి ఇంట్లోనే ఉండిపోయింది. గొడవ జరగడంతో తెల్లవారు జామున రెండు గంటలకు లేచి చూడడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె బయటకు వచ్చి చూసేసరికి శాను పింకీని కొడుతున్నాడు. అతను ఇటుకతో పింకీ తలపై కొట్టాడు.
అల్లరి చేయవద్దని అతను లక్ష్మిని బెదిరించాడు. అయితే, ఆమె గొడవ పెట్టడంతో ఇరుగుపొరుగువారు వచ్చి చూశారు. షానును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పింకీని అస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మరణించింది. రెండు వేల రూపాయలు ఇవ్వడానికి పింకీ నిరాకరించిందని, దాంతో తనకు కోపం వచ్చిందని షాను పోలీసులకు చెప్పాడు.












Click it and Unblock the Notifications