స్పీకర్ ముందుకు రాని టిడిపి రెబెల్ ఎమ్మెల్యేలు
పార్టీ విప్ను ధిక్కరించిన తమ పార్టీకి చెందిన 9 మంది శానససభ్యులపై అనర్హత వేటు వేయాలని నరేంద్ర చౌదరి స్పీకర్ను కోరారు. విప్ను ధక్కరించి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చిన తమ పార్టీకి చెందిన 9 మంది శానససభ్యులపై తెలుగుదేశం శానససభా పక్షం (టిడిఎల్పీ) ఇదివరకు ఫిర్యాదు చేసింది. అవిశ్వాస తీర్మానంపై తటస్థంగా ఉండాలంటూ టిడిఎల్పీ తన సభ్యులకు విప్ జారీ చేసింది. అయితే, వారంతా అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా నిలిచారు.
విప్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ టిడిఎల్పీ స్పీకర్కు సమర్పించిన జాబితాలో తెలుగుదేశం శాసనసభ్యులు శిరియా సాయిరాజ్(ఇచ్ఛాపురం), తానేటి వనిత (గోపాలపురం), కొడాలి నాని (గుడివాడ), చిన్నం రామకోటయ్య (నూజివీడు), అమర్నాథ్ రెడ్డి (పలమనేరు), ప్రవీణ్ కుమార్ రెడ్డి (తంబళ్లపల్లి), బాలనాగి రెడ్డి (మంత్రాలయం), హరీశ్వర్ రెడ్డి (పరిగి), వేణు గోపాలాచారి (ముధోల్)లు ఉన్నారు.
హరీశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరడానికి సిద్ధపడగా, వేణుగోపాలాచారి నాగం జనార్దన్ రెడ్డి ఏర్పాటు చేసిన తెలంగాణ నగారా సమితిలో ఉన్నారు. మిగతా ఏడుగురు శాసనసభ్యులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారు. కాంగ్రెసు తిరుగుబాటు శానససభ్యులు 9 మంది కూడా సోమవారం స్పీకర్ ముందు హాజరు కాలేదు.
తమపై వేటు వేయాలని వారు కోరారు. వేటు వేయాలని కోరినప్పుడు మళ్లీ విచారణకు హాజరు కావాల్సిన అవసరమేమిటని వారు అడిగారు.