వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ గ్యాంగ్‌రేప్ నిందితుడికి విషమిచ్చారు: లాయర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Delhi Gangrape
న్యూఢిల్లీ: ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసు నిందితుడైన 20 ఏళ్ల వినయ్ శర్మకు తీహార్ జైలులో విషమిచ్చారని అతని తరఫు న్యాయవాది ఆరోపించారు. వినయ్ శర్మకు రక్తం వాంతులు జరుగుతున్నాయని, తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడని, ఛాతీ నొప్పితో బాధపడుతున్నాడని, అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని న్యాయవాది ఎపి సింగ్ చెప్పారు.

జైలులో తోటి ఖైదీలు శర్మను కొట్టారని, తోసివేశారని అన్నారు. శర్మ పరిస్థితిపై జైలు అధికారులు ఏమీ మాట్లాడడం లేదు. అతన్ని హుటాహుటిన మంగళవారం లోక్‌నాయక్ ఆస్పత్రికి తరలించారు. ఛాతీ దెబ్బల కారణంగా అతన్ని ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. శర్మకు పెట్టిన ఆహారంలో విషం కలిపారని సింగ్ ఆరోపించారు.

స్లో పాయిజన్ వల్ల రక్తం వాంతులు జరుగుతున్నాయని అన్నారు. చాలా రోజులుగా అతని ఆహారంలో విషం కలుపుతున్నారని లాయర్ ఆరోపించారు. అతన్ని తొలుత జైలులోని క్లినిక్‌కు తరలించారని, ఆ తర్వాత నగరంలోని ఆస్పత్రికి మార్చారని, ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో మరో ఆస్పత్రికి తరలించారని ఆయన వివరించారు.

ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు రామ్ సింగ్ జైలులో ఉరేసుకుని మరణించిన విషయం తెలిసిందే. నడుస్తున్న బస్సులో రామ్ సింగ్, వినయ్ శర్మలతో పాటు మరో ముగ్గురు వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. డిసెంబర్ 16వ తేదీన ఆ సంఘటన జరిగింది. ఆ తర్వాత 13 రోజులకు బాధితురాలు సింగపూర్ ఆస్పత్రిలో మరణించింది.

English summary
Lawyer of 20-year-old Vinay Sharma claimed that the accused of infamous Delhi gang-rape case has been given poison in Tihar jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X