శ్రీశాంత్ ల్యాప్టాప్ సీజ్: ఉప్పల్ మ్యాచ్పైనా డౌట్
దర్యాప్తును ముందుకు సాగిస్తూ ఢిల్లీ పోలీసు బృందాలు అహ్మదాబాద్, కోల్కతా, ముంబై, హైదరాబాద్ చేరుకున్నాయి. స్పాట్ ఫిక్సింగ్కు సంబంధించి పోలీసులు మరిన్ని దాడులు నిర్వహించే అవకాశం ఉంది. స్పాట్ ఫిక్సింగ్లో చేతులు మారిన డబ్బులను స్వాధీనం చేసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 24 గంటల్లో డబ్బులను స్వాధీనం చేసుకుంటామని వారంటున్నారు.
కాగా, ఏప్రిల్ 7వ తేదీన హైదరాబాదులోని ఉప్పల్ మైదానంలో రాజస్థాన్ రాయల్స్కు, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచుపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాదులో జరిగిన ఈ మ్యాచు ఫుటేజ్లను పోలీసులు పరిశీలించే అవకాశాలున్నాయి. ఆ రోజు బుక్కీ ఒకతను హైదరాబాద్ స్టేడియంలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై రాజస్థాన్ రాయల్స్కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు శ్రీశాంత్, అజిత్ చండిల, అంకిత్ చవాన్లను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విచారణ నిమిత్తం పోలీసులు ఆ ముగ్గురిని కూడా తమ కస్టడీలోకి తీసుకున్నారు.