ఏకాభిప్రాయంతోనే.. కానీ రాదు: తెలంగాణపై లగడపాటి
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సమైక్యాంధ్ర వాద పార్టీలకే 270 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. బయ్యారం గనులపై ముడుపుల పార్టీలే రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. బయ్యారం గనుల పైన రాష్ట్ర ప్రజలందరికీ హక్కు ఉందని ఈ సందర్భంగా లగడపాటి చెప్పారు.
అధిష్టానానికి డెడ్లైన్ ఆ తర్వాత...
కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి పిసి చాకో వ్యాఖ్యల నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వివేక్ ఇంట్లో భేటీ అయిన కె కేశవ రావు, ఎంపీలు మంద జగన్నాథం, రాజయ్యలు అధిష్టానంకు అల్టిమేటం జారీ చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ నెలాఖరులోగా తెలంగాణపై తేల్చాలని అధిష్టానాన్ని డిమాండ్ చేయనున్నారు.
రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల్లో కాంగ్రెసు పార్టీని రక్షించుకోవాలంటే తెలంగాణకు అనుకూలంగా మే నెలాఖరులోగా నిర్ణయం తీసుకోవాలని అల్టిమేటం జారీ చేయనున్నారు. లేదంటే ఎవరి దారి వారు చూసుకోవాల్సి వస్తుందని చెప్పనున్నారు. మే నెలాఖరులోగా అధిష్టానం నిర్ణయం తీసుకోకుంటే ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాలని వారి నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం.