మీ ఇష్టం: రాజీనామాపై ధర్మాన, తెరాసలోకి టి ఎంపీలు!
తెరాసలోకి ఎంపీలు!
తెలంగాణ ప్రాంత ఎంపీలు మంద జగన్నాథం, రాజయ్య, పార్టీ సీనియర్ నేత కె కేశవ రావు పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వివేక్ ఇంట్లో భేటీ అయ్యారు. అనంతరం వారి మీడియాతో మాట్లాడారు. ఈ నెలాఖరులోగా తెలంగాణపై తేల్చాలని అల్టిమేటం జారీ చేశారు. మే నెలాఖరులోగా తేల్చకుంటే ఏ పార్టీలో చేరేది 30వ తేదిన చెబుతామన్నారు. తెలంగాణ అంశాన్ని కాంగ్రెసు పదే పదే వాయిదా వేస్తోందన్నారు.
తమకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పైన నమ్మకం ఉందన్నారు. నెలాఖరులోగా తేల్చాల్సిందే అన్నారు. పిసి చాకో తెలంగాణ ప్రజలను అవమానపర్చారన్నారు. తెలంగాణ ఇస్తామని కాంగ్రెసు చాలాసార్లు చెప్పిందని, ఇవ్వకుంటే కష్టాలు తప్పవన్నారు. తెలంగాణ తమ అజెండా కాదని కాంగ్రెసు అజెండానే అని వివేక్ అన్నారు. మిగతా ఎంపీలు తమ వైఖరిని వారే చెబుతారన్నారు. పిసి చాకో తెలంగాణపై రోజుకో మాట మాట్లాడుతున్నారన్నారు.
కాగా, ఈ నెల 30లోగా తాము ఏ పార్టీలో చేరేది చెబుతామని మందా జగన్నాథం, మిగతా ఎంపీలు వారి వైఖరిని వారే చెబుతారని వివేక్ చెప్పడం ద్వారా వారు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరేందుకు దాదాపు నిర్ణయించుకున్నారని అంటున్నారు.