మంత్రులపై జగన్ పార్టీ రివర్స్: కొణతాల వర్గంపై వేటు?
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మద్దతుతోనే కాంగ్రెసు పార్టీ అధికారంలో కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో కాంగ్రెసు హవా కొనసాగుతోందన్నారు. చంద్రబాబు ఈడికి ఫిర్యాదు చేయమంటే ఈడికి, సిబిఐకి ఫిర్యాదు చేయమంటే సిబిఐకి ఫిర్యాదు చేస్తారని ఆరోపించారు. మంత్రులను తొలగించాలంటే ఇప్పుడు తొలగిస్తారా అని ప్రశ్నించారు. ఇప్పుడు బాబు రాజీనామాలు అంగీకరించాలని డిమాండ్ చేస్తేనే అంగీకరిస్తారా అన్నారు.
టిడిపితో కుమ్మక్కైన కాంగ్రెసు బాబు కోసం సొంత పార్టీ నేతలనే బలిపెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. మంత్రులు రాజీనామాలు ఇచ్చినప్పుడు అంగీకరించకుండా ఇప్పుడు బాబు అంగీకరించమంటే అంగీకరిస్తారా అన్నారు. కళంకిత మంత్రులను తీసేసే వరకు తాము పోరాటే చేస్తామని చంద్రబాబు అంటుంటే నవ్వొస్తుందన్నారు. మంత్రులు ఎందుకు రాజీనామా చేశారో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వివరణ ఇవ్వాలన్నారు.
జివోలన్నీ మంత్రివర్గ నిర్ణయాలేనని ధర్మాన ప్రసాద రావు స్పష్టంగా చెప్పారన్నారు. అలాంటప్పుడు ఇద్దరు మంత్రులు ఎందుకు రాజీనామా చేశారో చెప్పాలన్నారు. కాంగ్రెసు, టిడిపి కుమ్మక్కులో భాగంగానే మంత్రులను బలి చేస్తున్నారన్నారు. వైయస్ పైన ఎలాంటి ఒత్తిడి లేదని ధర్మాన స్పష్టంగా చెప్పారన్నారు. అంతా చూస్తుంటే జగన్ పైన కక్ష సాధింపు అని అర్థమవుతోందన్నారు. జగన్ టిక్కెట్ హామీ ఇస్తే టిడిపి సగం ఖాళీ అవుతుందన్నారు.
కొణతాల వర్గంపై వేటు?
దాడి వీరభద్ర రావు రాకతో అలక వహించిన కొణతాల రామకృష్ణ వర్గానికి చెందిన ఐదుగురిపై వేటు వేసే దిశలో అధిష్టానం వెళ్తోందని అంటున్నారు. దాడి రాకను నిరసిస్తూ సమావేశం జరిపినందుకు ఐదుగురు కొణతాల వర్గం నాయకులకు అధిష్టానం షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.