హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హుస్సేన్‌సాగర్‌లో దూకి టెక్కీ భార్య ఆత్మహత్యయత్నం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hussain Sagar
హైదరాబాద్/కడప: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ సాఫ్టువేర్ ఇంజనీర్ భార్య తన ఇద్దరు పిల్లలతో కలిసి హుస్సేన్ సాగర్‌లో దూకి అత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన మంగళవారం ఉదయం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు మృతి చెందగా, తల్లిని పోలీసులు రక్షించారు. ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కుటుంబ కలహాల వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

గుప్త నిధుల కోసం నరబలి

కడప జిల్లాలో దారుణం జరిగింది. అట్లూరు మండలం వలసపాలెంలో గుప్త నిధుల కోసం ఓ యువకుడిని బలిచ్చారు. నర్సింహ అనే ఇరవై అయిదేళ్ల యువకుడు సోమవారం రాత్రి నుంచి కనిపించలేదు. తల్లిదండ్రులు గాలించగా.. ఉదయం పోతులూరి దేవాలయం వద్ద రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహం లభించింది.

పోలీసులకు సమాచారం అందటంతో వారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గుప్త నిధుల కోసమే యువకుడిని బలి ఇచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

ప్రమాదంలో ముగ్గురు మృతి

ప్రకాశం జిల్లా ఒంగోలులో త్రోవగుంట వద్ద జాతీయ రహదారి పైన జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. లారీ, స్కార్పీయో ఢీకొనడంతో ఇది జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

భార్యను చంపిన భర్త

గుంటూరు నగర శివారు గోరంట్ల ప్రాంతంలో లక్ష్మి అనే మహిళ భర్త చేతిలో హత్యకు గురయింది. భార్యపై అనుమానంతో భర్త థామస్ ఆమె గొంతు నులిమి చంపేశాడు. నిందితుడు పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు.

English summary
Sagar police rescued a woman, who jumped in to Hussain Sagar on Tuesday morninjg.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X