హుస్సేన్సాగర్లో దూకి టెక్కీ భార్య ఆత్మహత్యయత్నం
గుప్త నిధుల కోసం నరబలి
కడప జిల్లాలో దారుణం జరిగింది. అట్లూరు మండలం వలసపాలెంలో గుప్త నిధుల కోసం ఓ యువకుడిని బలిచ్చారు. నర్సింహ అనే ఇరవై అయిదేళ్ల యువకుడు సోమవారం రాత్రి నుంచి కనిపించలేదు. తల్లిదండ్రులు గాలించగా.. ఉదయం పోతులూరి దేవాలయం వద్ద రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహం లభించింది.
పోలీసులకు సమాచారం అందటంతో వారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గుప్త నిధుల కోసమే యువకుడిని బలి ఇచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
ప్రమాదంలో ముగ్గురు మృతి
ప్రకాశం జిల్లా ఒంగోలులో త్రోవగుంట వద్ద జాతీయ రహదారి పైన జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. లారీ, స్కార్పీయో ఢీకొనడంతో ఇది జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
భార్యను చంపిన భర్త
గుంటూరు నగర శివారు గోరంట్ల ప్రాంతంలో లక్ష్మి అనే మహిళ భర్త చేతిలో హత్యకు గురయింది. భార్యపై అనుమానంతో భర్త థామస్ ఆమె గొంతు నులిమి చంపేశాడు. నిందితుడు పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు.