ఐపిఎల్6 స్పాట్ ఫిక్సింగ్ రింగులో టాప్ నటీమణులు?
ఇందులో పలువురు పెద్దల పాత్ర ఉన్నట్లుగా విచారణాధికారులు అనుమానిస్తున్నారు. బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు, చెన్నై సూపర్ కింగ్స్ సిఈవో గురునాథ్ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇందులో భాగంగా పలువురు నటీమణులను కూడా విచారించాలని పోలీసులు భావిస్తున్నారని సమాచారం. ప్రధానంగా ప్రముఖ తమిళ హీరోయిన్లను విచారించాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
స్పాట్ ఫిక్సింగ్కు సంబంధించిన కేసులో పలువురు నటీనటీమణులను విచారించే అవకాశాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఐపిఎల్ 6 మ్యాచులను వీక్షించేందుకు పలువురు ప్రముఖులు, సినిమా కథానాయకులు రావడమే కాకుండా హల్ చేసిన సందర్భాలు ఉన్నయి.
క్రికెటర్లకు సంబంధించిన పలు పార్టీలలో నటీమణులు కూడా పాల్గొన్నారని పోలీసులు భావిస్తున్నారు. ఈ విచారణ రింగ్లో తమిళంతో పాటు తెలుగు నటీమణులు కూడా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. సాధ్యమైనంత త్వరగా వారిని విచారించాలని పోలీసులు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.