మధురైలో మీడియాను బోల్తా కొట్టించిన గురునాథ్
కొడై కెనాల్ నుంచి ఆయన మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు బయలుదేరారు. గురునాథ్ కోసం మీడియా ప్రతినిధులు లాంజ్కు వెళ్లే ప్రవేశద్వారం పెద్ద యెత్తున మధ్యాహ్నం రెండు గంటల నుంచే నిరీక్షించారు. గురునాథ్ ఎప్పుడైనా రావచ్చునని వారు ఉత్కంఠతో ఎదురు చూడడం మొదలుపెట్టారు. అయితే, వారికి కనిపించకుండా గురునాథ్ లోనికి వెళ్లిపోయారు.
గురునాథ్ కారులో వస్తాడని భావించి మీడియా ప్రతినిధులు ప్రతి కారును చూస్తూ ఉండిపోయారు. నీలం రంగు డెనిమ్స్, దళసరి నీలం రంగు చొక్కా ధరించిన ఆయన తన కారు నుంచి చాలా దూరంగా దిగి, ఎంట్రీ పాయింట్కు నడిచి వచ్చారు. లాంజ్లోకి ప్రవేశించే సమయంలో మీడియా ప్రతినిధులు ఆయనను గుర్తించారు.
అయితే, గురునాథ్ను ఓ జాతీయ మీడియా సంస్థకు చెందిన ప్రతినిధి మాత్రం పట్టుకోగలిగారు. తన విషయంలో ఏ విధమైన వివాదం లేదని ఆయన ఆ ప్రతినిధితో అన్నారు. ప్రశ్నలు వేయడానికి ఆ ప్రతినిధి సిద్ధపడగా గబగబా విమానాశ్రయంలోకి వెళ్లిపోయారు. ఆయన వెంట ఇద్దరు వ్యక్తులున్నారు.