వేధిస్తున్నారు: పాణ్యం ఎమ్మెల్యేపై ఓ మహిళ ఫిర్యాదు
ఎమ్మెల్యే తన ఇంట్లోనే కాంగ్రెసు పార్టీ కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారని ఆరోపించారు. తన ఇంటిని రక్షించుకునేందుకు తాను కోర్టులో పోరాడుతున్నానని చెప్పారు. ప్రస్తుతం తాను తన సోదరి ఇంట్లో ఉంటున్నానని, ఆ ఇంటిని కూడా కబ్జా చేసేందుకు తన అనుచరులను పంపించారని మహిళ ఆరోపిస్తున్నారు. పోలీసుల అండతో తనను చంపే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
తనపై ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేసి మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని చెప్పారు. స్థానిక ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములను ఎమ్మెల్యే కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని, దానిని తాను అడ్డుకున్నందుకే తనపై కక్ష పెంచుకున్నాడని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని తాను హెచ్చార్సీలో ఫిర్యాదు చేశానని చెప్పారు.
కిడ్నాప్ కేసులో....
ఓ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే తనయుడు మేఘనాథ్తో పాటు మరో ఇద్దరిని పోలీసులు కృష్ణా జిల్లాలో అరెస్టు చేశారు. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో చంద్రమౌళి అనే వ్యక్తిని కిడ్నాప్ చేసినట్లుగా ఆయన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.