వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విందుతో భార్య ఫోటో: చిన్నబోయిన ధోనీ, మీడియాకి నో

By Srinivas
|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ మీడియాకు మరోసారి ముఖం చాటేశాడు. మీడియాకు ధోనీ దూరంగా ఉండటం రెండు రోజుల్లో ఇది రెండోసారి. కోల్‌కతాలో ఐపిఎల్ ముంబై ఇండియన్స్‌తో ఐపిఎల్ మ్యాచ్ ముగిసిన అనంతరం జరిగిన విలేకరుల సమావేశానికి ధోనీ దూరంగా ఉన్నాడు.

మ్యాచ్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల సారథులు సంయుక్తంగా విలేకరులతో మాట్లాడాల్సి ఉండగా చివరి నిమిషంలో ఇరుజట్ల కోచ్‌లు మాత్రమే పాల్గొన్నారు. మీడియా ఎదుటకు మహేంద్ర సింగ్ ధోనీ రావడానికి ఇష్టపడకపోవడమే అందుకు కారణం.

మ్యాచ్ పూర్తయ్యాక జరిగిన సమావేశానికి కూడా అతడు దూరంగా ఉన్నాడు. ధోనీని కోచ్ స్టీపెన్ ఫ్లెమ్మింగ్ వెనుకేసుకొచ్చాడు. ధోనీ సాధారణంగానే మీడియాకు దూరంగా ఉంటాడనే విషయం మీకందరికీ తెలుసునని ఫ్లెమ్మింగ్ ధోనీని వెనుకేసుకొచ్చాడు. ఏవైనా జట్టు విషయాలను తాను చెబుతానని అన్నాడు.

MS Dhoni

కారణం అదేనా?

ధోనీ ముభావంగా, మీడియాకు దూరంగా ఉండటానికి కారణం తమ జట్టు సిఈవో గురునాథ్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్టు కావడంతో పాటు తన సతీమణి సాక్షి సింగ్ ధోనీ స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టైన బాలీవుడ్ నటుడు విందూ దారా సింగ్‌తో కలిసి మ్యాచ్ చూడటం చర్చనీయాంశం కావడమే కావొచ్చునని అంటున్నారు.

English summary
Chennai Super Kings skipper Mahendra Singh Dhoni avoided the media for the second time in two days in the wake of the spot-fixing scandal, but coach Stephen Fleming defended the captain, saying he was well known for being reclusive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X