కళంకితులపై రాయపాటి, జైలుపార్టీ అని జగన్పై వీరశివా
కర్నాటక రాష్ట్రంలో బిజెపి అధికారంలో ఉండగా మంత్రులు అవినీతికి పాల్పడిన కారణంగా ఆ పార్టీని ఓడించి కాంగ్రెసుకు అక్కడి ఓటర్లు పట్టం కట్టారన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో జాగ్రత్త పడాలని సూచించారు. అక్రమాలతో ప్రత్యక్ష సంబంధం లేకు్ననా ఆరోపణల నేపథ్యంలో పవన్ కుమార్ బన్సల్, అశ్వనీ కుమార్లను కేంద్రం తొలగించిందని ఆయన గుర్తు చేశారు. అధిష్టానం తీసుకునే చర్యలతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు.
పనికిరాని మంత్రులు వద్దు: వీరశివా
కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న పనికిరాని మంత్రులను తొలగించాలని కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే వీరశివా రెడ్డి డిమాండ్ చేశారు. కిరణ్ స్వచ్ఛమైన వారికే మంత్రి పదవి ఇవ్వాలని, మంచి పాలన అందించేందుకు కృషి చేయాలన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెసు ఆశాజ్యోతి కిరణే అన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతితో తడిసి ముద్దై జైల్లో మగ్గుతున్నారన్నారు. జగన్ పార్టీ జైలు పార్టే అన్నారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడి కుమారుడు సంపదించనంతగా జగన్ సంపాదించాడని, అప్పుడే సాక్షి మీడియాను పెట్టారని, బెంగళూరులో రాజ్ మహర్, హైదరాబాదులో లోటస్ పాండులు సొంతం చేసుకున్నారన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు చంద్రబాబు తూట్లు పొడిచారన్నారు.