వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎంకు టైం దగ్గరపడింది, శ్రీకృష్ణ జన్మస్థానమే: శంకరన్న

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy - Shankar Rao
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఇంటికి పంపించే సమయం దగ్గర పడిందని మాజీ మంత్రి, కంటోన్మెంట్ శాసనసభ్యుడు శంకర రావు శుక్రవారం అన్నారు. ముఖ్యమంత్రి దళిత వ్యతిరేకిగా మారారని మండిపడ్డారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్నారన్నారు.

కేంద్రం తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకుంటే వారు ఇతర పార్టీలలో చేరరని, కాంగ్రెసుకు దూరం కారని అన్నారు. ఇంకెవరు పార్టీని విడువరన్నారు. తెలంగాణ ఇచ్చేది కాంగ్రెసు పార్టీ మాత్రమే అన్నారు. 2014 ఎన్నికలలోపు కాంగ్రెసు తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేస్తుందని చెప్పారు. తెలంగాణ వస్తుందన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఇంటికి పంపించేందుకు అధిష్టానం సిద్ధమవుతోందన్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో ఆయనకు శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసును దర్యాఫ్తు చేస్తున్న సిబిఐ జెడి బదలీ బాధాకరమన్నారు. తుది ఛార్జీషీటు వేసే వరకు ఆయన ఉంటే బాగుండేదన్నారు.

మోపిదేవి బెయిల్ పిటిషన్

జగన్ ఆస్తుల కేసులో వాన్‌పిక్ వ్యవహారంలో నిందితుడిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ శుక్రవారం సిబిఐ ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరఫు న్యాయవాది నాంపల్లి ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు.

English summary
Former Minister Shankar Rao has said that Congress Party High Command is ready to sent CM Kiran Kumar Reddy to his home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X