వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ రిమాండ్ పొడిగింపు: లొంగిపోనున్న సాయి రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు, ఎమ్మార్, ఓఎంసి కేసుల నిందితులకు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం రిమాండును ఈ నెల 17వ తేది వరకు పొడిగించింది. ఎమ్మార్ కేసులో విజయ రాఘవ, జగన్ కేసులో విజయ సాయి రెడ్డి, ఓఎంసి కేసులో రాజగోపాల్ తదితరులు కోర్టుకు హాజరయ్యారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డిని, గాలి జనార్ధన్ రెడ్డిని, మోపిదేవి వెంకటరమణను, నిమ్మగడ్డ ప్రసాద్‌లను కోర్టు వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించింది. అనంతరం వారి రిమాండును రెండు వారాలపాటు పొడిగించింది. జగన్ కేసు వాన్‌పిక్ అంశంలో హాజరు కావాల్సిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేనని కోర్టుకు తెలిపారు.

5న విజయ సాయి లొంగుబాటు!

జగన్ ఆస్తుల కేసులో ఎ2 నిందితుడిగా ఉన్న ఆడిటర్ విజయ సాయి రెడ్డి ఈ నెల 5న సిబిఐ కోర్టులో లొంగిపోవాల్సి ఉంది. బెయిల్ పైన ఆయన విడుదలయ్యారు. దీంతో అతని బెయిల్ రద్దు చేయాలంటూ సిబిఐ సుప్రీం కోర్టుకు వెళ్లింది. బెయిల్‌ను కోర్టు రద్దు చేసింది.

తన కూతురు పెళ్లి ఉన్నందున విజయ సాయి రెడ్డికి సుప్రీం కోర్టు ఈ నెల 5వ తేది వరకు లొంగిపోయేందుకు అనుమతిని ఇచ్చింది. దీంతో బుధవారం ఆయన కోర్టులో లొంగిపోయే అవకాశముంది.

English summary

 A special CBI court extended YSR Congress Party chief YS Jaganmohan Reddy's judicial remand today till June 17 along with others accused.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X