బిసిసిఐ సమావేశంపై ఆసక్తి: టీవీలో చూసిన శ్రీశాంత్
శ్రీశాంత్, అజిత్ చండిల ఆదివారంనాడు బిసిసిఐ అత్యవసర సమావేశం వివరాలను తెలుసుకోవడానికి టీవీకి అతుక్కుపోయారని చెబుతున్నారు. శ్రీశాంత్ ప్రతి రోజూ వార్తాపత్రికలు చదువుతున్నాడని సమాచారం. ఇద్దరు కూడా అలజడి లేకుండా ఉంటున్నారని, శ్రీశాంత్ మరీ మౌనంగా ఉంటున్నాడని జైలు అధికారులు చెప్పారు.
శ్రీశాంత్, అజిత్ చండిల పరిస్థితులకు సర్గుకుంటున్నారని, శ్రీశాంత్ అత్యంత ఆసక్తిగా వార్తాపత్రికలు చదువుతున్నాడని అంటున్నారు. శ్రీశాంత్ ఐదు కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. అరెస్టయినప్పటి నుంచి లో బ్లడ్ ప్రెషర్తో బాధపడుతున్నాడని చెబుతున్నారు. అన్న దీపు సింగ్ శ్రీశాంత్ను జైలులో కలిశాడు. అప్పటి నుంచి ఆయనను ఎవరూ కలవలేదు.
కాగా, స్పాట్ ఫిక్సింగ్ కేసులో రాజస్థాన్ రాయల్స్కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు శ్రీశాంత్, అజిత్ చండిల, అంకిత్ చవాన్లను పోలీసులు మే 16వ తేదీన అరెస్టు చేశారు. వివాహం చేసుకోవడానికి అంకిత్ చవాన్కు కోర్టు ఈ నెల 6వ తేదీ వరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.