జగన్ కంపెనీల్లో పెట్టుబడులు: శ్రీనివాసన్కు కొత్త కష్టాలు
అదే క్రమంలో ఇండియా సిమెంట్స్ యజమాని శ్రీనివాసన్పై అభియోగాలు మోపే అవకాశం ఉంది. అలాగే ఇండియా సిమెంట్స్కు నీటి కేటాయింపులు చేసినందుకు అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి, ప్రస్తుత ఐటి మంత్రి పొన్నాల లక్ష్మయ్య పైనా అభియోగాలు నమోదయ్యే అవకాశం ఉంది.
మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసులో మరిన్ని చార్జిషీట్లు వేస్తామని సిబిఐ చెబుతున్నందున తొలి చార్జిషీట్పై విచారణ మొదలు పెట్టడం చట్టసమ్మతం కాదని జగతి ఆడిటర్ విజయ సాయి రెడ్డి తరఫు న్యాయవాది సుశీల్ కుమార్ నాంపల్లి సిబిఐ కోర్టుకు చెప్పారు. ఏ కేసులోనైనా దర్యాప్తు అంతా పూర్తయ్యాకే విచారణ ప్రారంభమవుతుందన్నారు.
అక్రమాస్తుల కేసులో దాఖలైన అన్ని చార్జిషీట్లను కలిపి ఒకేసారి విచారణ జరపాలని కోరుతూ వైయస్ జగన్, సాయి రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం వాదనలు జరిగాయి. అయితే సిబిఐ గడువు కోరడంతో కేసు 5వ తేదీకి వాయిదా పడింది.