స్పాట్ ఫిక్సింగ్: గురు, విందులకు బెయిల్ మంజూరు
అంతకుముందు ముంబై కోర్టు విందూ, గురునాథ్ బెయిల్ పిటిషన్లను మంగళవారానికి వాయిదా వేసింది. వారికి ఈ నెల 14వ తేది వరకు జ్యూడిషియల్ కస్టడీని విధించింది. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తమకు రిమాండు విధించిన తర్వాత మరోసారి బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.
క్రికెటర్లు శ్రీశాంత్, అజిత్ చండిలా సహా పన్నెండు మంది బెయిల్ పిటిషన్లను ఢిల్లీ సాకేత్ కోర్టు మంగళవారం విచారించనుంది. శ్రీశాంత్ను జూన్ 5వ తేది వరకు తమ కస్టడీకి అప్పగించాలని ఢిల్లీ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిని కోర్టు తోసిపుచ్చింది.
రాజస్థాన్ రాయల్స్ సస్పెండ్ చేసిన అంకిత్ చవాన్ బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టి వేసింది. అంకిత్ తాత్కాలిక బెయిల్ పైన విడుదలై రెండు రోజుల క్రితం స్నేహితురాలిని వివాహం చేసుకున్నాడు. ఇతను ఈ నెల 6వ తేదిన ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోవాల్సి ఉంది. దీంతో అతను బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే కోర్టు తోసి పుచ్చింది.