ఫిక్సింగ్: శిల్పా భర్త కుంద్రాను ప్రశ్నిస్తున్న పోలీసులు
రాజస్థాన్ రాయల్స్కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు శ్రీశాంత్, అజిత్ చండిల, అంకిత్ చవాన్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం కేసులో పోలీసులు అరెస్టు చేశారు. తామే తప్పు చేయలేదని ముగ్గురు ఆటగాళ్లు కూడా అంటున్నారు. రాజస్థాన్ ఆటగాళ్ల గురించి పోలీసులు కుంద్రాను ప్రశ్నించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
శ్రీశాంత్కు కోర్టు మంగళవారం బెయిల్ నిరాకరించింది. శ్రీశాంత్తో పాటు మిగతా ఆటగాళ్లపై, బుకీలపై మోకా ప్రయోగించే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. పాకిస్తాన్లో ఉంటున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతని అనుచరుడు ఛోటా షకీల్ భారతదేశంలోని బెట్టింగ్ను నియంత్రించినట్లు పోలీసులు చెబుతున్నారు.
గురునాథ్ మేయప్పన్ అరెస్టయిన నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై కూడా పోలీసులు విచారణ చేపట్టారు. గురునాథ్ మంగళవారంనాడు బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై రాజస్థాన్ రాయల్స్ సహ యజమానురాలు, కుంద్రా భార్య శిల్పా శెట్టి స్పందించారు. తనకు గుండె పగిలినంత పనైందని ఆమె వ్యాఖ్యానించారు.